భారత్కు మరోసారి షాక్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులకు ఇచ్చే పన్ను మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే దాదాపు 5.6 బిలియన్ డాలర్ల సరుకులపై భారీగా పన్నులు పడే అవకాశం ఉంది.
ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు ఎగుమతి అయ్యే వస్తువులపై టారీఫ్లు, ఛార్జీలు భారీగా ఉన్నాయని అగ్రరాజ్యం అసంతృప్తిగా ఉంది. దీనిపై ఇరు దేశాల మధ్య కొంత వివాదం కూడా జరుగుతోంది. తాజాగా భారత్ సరుకులపై అమెరికా ఛార్జీలు విధిస్తే ఈ వివాదం మరింత పెరిగే అవకాశం ఉంది.