టీవీ నటి ఝాన్సీ పెళ్లి కోసం పదిలక్షల రూపాయలతో నగలు కూడబెట్టామని.. సూర్యతేజ అనే యువకుడి కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు దుర్గా ప్రసాద్తో కలిసి హైదరాబాద్, పంజాగుట్ట పోలీసు స్టేషన్కు వచ్చిన ఆమె.. వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో చెప్పారు.
వారిద్దరి ప్రేమపై తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చామని ఝాన్సీ తల్లి సంపూర్ణ తెలిపారు. ఝాన్సీకి మోసపు మాటలు చెప్పిన సూర్యతేజ వాటిని కాజేశాడని, సూర్య పుట్టినరోజున తన కుమార్తె ఖరీదైన బైక్ను బహుమతిగా ఇచ్చిందని తెలిపారు.
చివరకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని అంటగడితే తట్టుకోలేక, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వెంటనే సూర్యతేజను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఝాన్సీ ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇకపోతే.. చనిపోయేముందు ఝాన్సీ తన బాయ్ఫ్రెండ్ తేజకు 20 కాల్స్ చేసిందని పోలీసులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఆమె ఐఫోన్ను డేటాను పరిశీలించేందుకు అన్ లాక్ చేస్తున్నారు.