ఏపీని సన్ రైజ్‌ చేస్తానని లోకేష్‌ను అలా చేస్తున్నారు.. మోదీ

0
53

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారని ప్రధాన మంత్రి మోదీ దుయ్యబట్టారు. సన్ రైజ్ రాష్ట్రంగా చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు కుమారుడు లోకేశ్‌ను రైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు.

కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసి ఏపీ సీఎం చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం విషయంలో మాటమారిస్తే ఈ కాపలాదారు ఊరుకోడని స్పష్టం చేశారు. అమరావతి నవనిర్మాణ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పడు కుప్పకూలిపోయిన టీడీపీని పునర్ నిర్మించుకునే పనిలో బీజేపీ ఉన్నారని దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు ఈ కూటమితో కలిసి తనను తిట్టిపోసే పోటీలో దిగిపోయారని సెటైర్లు. విపక్షాలది మహాకూటమి కాదనీ, మహా కల్తీ కూటమి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మోదీ తెలుగులో మాట్లాడి ప్రజలను అలరించారు. దళితరత్నం, కవికోకిల గుర్రం జాషువా, మహాకవి తిక్కన్న జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం అన్నారు.

అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉందనీ, ఇక్కడి పురాతత్వ కట్టడాలను పరిరక్షించడానికి హృదయ్ పథకంలో చేర్చామన్నారు. అమరావతిని గతంలో ఆంధ్రా ఆక్స్ ఫర్డ్‌గా అభివర్ణించేవారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వచ్చేవారని తెలిపారు. త్వరలో తొలిసారి ఓటు హక్కును పొందనున్న యువత ఈ ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు.