మోదీకి భయపడి జగన్ దాక్కున్నారా? లోటస్‌ పాండ్‌లో హాయిగా నిద్రపోయారా?

0
39

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మోదీ రాకను ఏపీ రాజకీయ నేతలందరూ తప్పుబడితే.. వైకాపా చీఫ్ జగన్ మౌనం వహించడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. ఏపీకి మోదీ రావడంతో జగన్ ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. మోదీ సభకు జనాలు రాకపోవడంతో… సొంత వాహనాల్లో వైసీపీ కార్యకర్తలను సభకు పంపించారని అన్నారు. మోదీతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

ఇదే తరహాలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా వైకాపా చీఫ్ వ్యవహారంపై ట్విట్టర్లో స్పందించారు. మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ? 26 కేసులుకు భయపడి జగన్ దాక్కున్నారా? అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని భయం పట్టుకుందా అని.. అడిగారు. ఇంకా లోటస్‌ పాండ్‌లో హాయిగా పడుకున్నారా? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి #GoBackModi #ModiIsaMistake హ్యష్ ట్యాగ్‌ను జతచేశారు.