మోదీ విలన్.. మరో 20 రోజులు మాత్రమే ఆయన ప్రధాని.. రఘువీరా రెడ్డి

0
47

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విలన్‌గా అభివర్ణించారు… ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. అనంతపురంలో రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాలం చెల్లిందని.. మరో 20 రోజులు మాత్రమే ఆయన పదవిలో వుంటారని.. రఘువీరా రెడ్డి జోస్యం చెప్పారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరులో ప్రధాని సభ ఘోరం విఫలమైందని.. మోదీ ఓటమికి నిదర్శనమని రఘువీరా రెడ్డి విమర్శించారు. బీజేపీకి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా మద్దతిచ్చే పార్టీలకు మద్దతిచ్చే పార్టీలకు ప్రజలే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

మరోవైపు ప్రధాని మోదీ గద్దె దిగితేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ సభకు వైసీపీ జనాలను పంపించిందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం విభజన హామీలు అమలు కావన్నారు.