రూ.3వేలు తీసుకోండి.. ఈ రాక్షసుడికి ఓటేయకూడదు.. అనుకోండి..

0
58

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు కోసం చంద్రబాబు రూ.3వేలు ఇస్తే వద్దనకుండా తీసుకోండి. అంతేకాదు.. రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని సలహా ఇచ్చారు. అయితే డబ్బు తీసుకునే సందర్భంగా ఈ రాక్షసుడికి ఓటేయకూడదని మనసులో అనుకోవాలన్నారు.

ఏ దేవుడుఅయినా అవినీతి సొమ్ము తీసుకుని ఓట్లేయమని చెప్పడన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గ్రామాలకు మూటలకుమూటలు డబ్బులు పంపించబోతున్నారని

టీడీపీ అక్రమాలపై పోరాడేందుకు ఎన్నికల సంఘం తెచ్చిన ”సీ విజిల్” అనే యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలని జగన్ ఆదేశించారు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేస్తే కేవలం 100 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి వాటిపై స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతామని అవ్వాతాతలకు చెప్పాలన్నారు.