ఏపీ భవన్ వద్ద ఆంధ్రా వ్యక్తి ఆత్మహత్య

0
25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష జరుగనుంది.

ఐతే ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన దవళ అర్జున్ రావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ. ఆర్ధిక ఇబ్బందులు వలనే తాన సూసైడ్ చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, ఆపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.