ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

0
22

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్ ప్రాంతంలోని అర్పిత్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మంటల్లో చిక్కుకున్న 35 మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు.

ఈ ప్రమాదంలో విశాఖ HPCL డిప్యూటీ మేనేజర్ చలపతిరావు కన్నుమూశారు. డిల్లీలో జరిగే పెట్రోటెక్ సదస్సుకు  జరయ్యేందుకు ఆ హోటల్‌లో బస చేసిన ఆయన అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
క్షతగాత్రులను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘనటపై స్పందించారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి 5లక్షల నష్టపరిహాన్ని ఇస్తామని ప్రకటించారు. ఈ దుర్టటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారులు బృందాన్ని నియమించనున్నట్లగా ఆయన తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంక తెలియరాలేదని కెజ్రీవాల్ వెల్లడించారు.