తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని గతకొద్ది కాలం గా వార్తలొస్తున్నాయన్న విషయం తెలిసిందే.. కానీ, ఈ వార్తల్లో నిజమెంత అనే విషయం పై నిన్నటి వరకూ ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ, ఈరోజు అందరకీ ఓ క్లారిటీ వచ్చింది.
తాను సాయేషా ని ఈ సంవత్సరం మార్చ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు హీరో ఆర్య. ఐతే వాలెంటైన్స్ రోజు అనౌన్స్ చేయడం విశేషం.
తెలుగులో సూపర్హిట్ అయిన నాని చిత్రం ‘భలేభలే మగాడివోయ్’ని తమిళంలో ‘గజినీకాంత్’గా రీమేక్ చేశారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్య, సాయేషా జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని సమాచారం.