చిగురుబాటి జయరామ్ హత్య కేసు: టాలీవుడ్ నటుడు కి లింకేంటి?

0
28

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ అలియాస్ ఎన్నారై జయరామ్ హత్య కేసు విచావరణ సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో టాలీవుడ్ నటుడు పేరు ఒకటి వెలుగులోకి వచ్చింది. అతని పేరు సూర్య ప్రసాద్. పలు చిత్రాల్లో చిన్నచిన్నపాత్రల్లో నటించాడు.

సీనియర్ హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన చిత్రం “ఆ నలుగురు” చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ కుమారుడుగా నటించిన సూర్య ప్రసాద్‌… ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి తో మాట్లాడినట్టు మొబైల్ కాల్ డేటాలో నమోదైవుంది. దీంతో అతనితో కూడా పోలీసులు విచారణ జరిపారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని విచారించనున్నారు.