వివాదం రేపుతున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

0
33

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ ని రామ్ గోపాల్ వర్మ ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్‌కి చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని.. అలాగే లక్ష్మీ పార్వతికి జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అంటూ ఆడియన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ ఎపుడైతే “ఎన్టీఆర్ బయోపిక్” అనౌన్స్ చేసాడో..రామ్ గోపాల్ వర్మ కూడా రంగం లోకి దిగి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. అప్పటినుంచే జనాల్లో ఓ ఆసక్తి ఏర్పడింది. రామ్ గోపాల్ వర్మ దేనికి భయపడకుండా నిజాలు చూపించాడని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ తీసిన “ఎన్టీఆర్ కథానాయకుడు” ఘోరం గా ప్లాప్ అవ్వడమే కాకుండా, జనాల్ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక రామూ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుండటం తో సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.