బ్రేకింగ్.. వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్

0
38

టీడీపీ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌.. ఇవాళ లోటస్‌పాండ్‌లోని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు ఎంపీ అవంతి శ్రీనివాస్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అవంతి శ్రీనివాస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.