జయరాం హత్య కేసు.. నిందితుడుని కోర్టు ముందు హాజరుపర్చనున్న పోలీసులు!

0
25

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచావరణ సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఐతే కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఈరోజు పోలీసులు రాకేష్ రెడ్డి ని నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారని సమాచారం.

రాకేశ్ రెడ్డి కారుతో పాటు అతని బ్యాంకు ఖాతా వివరాలు, కొన్ని కీలక పత్రాలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు పోలీసులు. దర్యాప్తు కీలక దశలో ఉందనీ, విచారణ పూర్తయిన తర్వత పూర్తి వివరాలను మీడియాకు చెబుతామన్నారు.