ప్రజా ధనాన్ని బాబు దుర్వినియోగపరిచారు: పృథ్వీరాజ్

0
24

ప్రముఖ హాస్యనటుడు, వైసీపీకి చెందిన పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో చేసిన ధర్మ పోరాట దీక్ష కోసం చేసిన ఖర్చుపై మండిపడ్డారు. ఒక్కరోజు దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచారని విమర్శించారు.

దీక్ష ఖర్చు రూ.10 కోట్లని ప్రచారం జరగడం తో దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారట. దీక్షకు అయిన ఖర్చు కేవలం రూ.2.83 కోట్లు మాత్రమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు చెప్పారని తెలుస్తోంది.