ఓట్ల తొలగింపు…. వైసీపీ పార్టీ నేతలు ధర్నా

0
44

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలంటూ.. వైసీపీ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఆరు మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను చుట్టుముట్టారు. “ఉయ్ వాంట్ జస్టీస్” అంటూ నినాదాలు చేశారు. 13వేలకు పైగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని.. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చంద్రగిరి
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు సరిదిద్దుకోకపోతే ప్రపంచ వ్యాప్తంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని గురించి
చర్చించుకునేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఓట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.