చాలా మంది పరగడపన చెంబుడు నీళ్లు తాగుతుంటారు. కొంతమంది అయితే, గోరువెచ్చని నీటిని తాగుతారు. ఇలా పరగడపన నీళ్లు సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* నిద్రలేవగానే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.
* పరిగడపన నీళ్లు తాగటం వల్ల శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
* పెద్ద పేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
* రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఎంతగానో దోహదపడుతుంది.
* కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.
* శరీర బరువు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
* చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.
* అన్నిటికంటే ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
* ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.