మా వైపు కన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తాం : పాక్ మంత్రి

0
43

పాకిస్థాన్ మంత్రి ఒకరు నోరు పారేసుకున్నారు. ఆయన పేరు షేక్ రషీద్ అహ్మద్. పాకిస్థాన్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈయన పుల్వామా ఉగ్రదాడి ఘటనపై నోరు పారేసుకున్నారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ – భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్థాన్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. భారత్ సంప్రదాయ యుద్ధానికి దిగితే తామూ సిద్ధమేనంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మంత్రిగారు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఓ వీడియో సందేశం ద్వారా ఆయన హెచ్చరికలు చేశారు. ‘మనసులో దుష్ట తలంపుతో పాకిస్థాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు’ అని రషీద్ అహ్మద్ హెచ్చరించారు.

Radio Pakistan on Twitter: Video Message of Federal Minister for Railways