పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన పాకిస్తాన్ మహిళలు

0
74

పుల్వామా దాడిని కొంతమంది పాకిస్థాన్ మహిళలు ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సెహీర్ మీర్జా అనే మహిళా జర్నలిస్ట్ పుల్వామా దాడిని ఖండిస్తూ “యాంటీ హేట్ చాలెంజ్” పేరుతో ఒక కాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు పాక్ లో చాలామంది మహిళలు ఎలాంటి భయం లేకుండా లేకుండా #AntiHateChallenge అని టైపు చేసి పుల్వామా దాడిని ఖండిస్తున్నారు. యాంటీహేట్ చాలెంజ్ హ్యాష్ ట్యాగ్ తో పాటు ‘వీ స్టాండ్ విత్ ఇండియా’, నో టు వార్ హ్యాష్ ట్యాగ్ లతో పాకిస్థాన్ మహిళలు పుల్వామా ఘటనను ఖండిస్తూ పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.