చూపించడంలోనూ.. తీసుకోవడంలోనూ రాజీపడను: రకుల్

0
43

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గ్లామరస్ హీరోయిన్. అందాలు ఆరబోయడంలో ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.

కానీ, నిజానికి ద్విభాషా చిత్రం మహేష్ నటించిన చిత్రం “స్పైడర్”. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయినా రకుల్ కెరీర్ మసకబారింది.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత చైతూతో కలసి ‘వెంకీ మామ’లో నటించనున్న రకుల్.. అదే ఊపులో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిందట.

అలాగే, బెల్లంకొండ సాయితో నటించనుంది. తమిళనాట మంచి విజయం సాధించిన ‘రాచ్చసన్’.. తెలుగులో రీమేక్ కానుండగా అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జోడీగా రకుల్ పేరునే పరిశీలిస్తున్నారని టాక్.

అదేసమయంలో తమిళ హీరో కార్తీ నటించిన చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్ హీరోయిన్. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. ఈ చిత్రం ఘోరంగా దెబ్బతిన్నా.. పారితోషికం విషయంలో మాత్రం ఆమె రాజీ పడడం లేదట. ఈ రీమేక్ చిత్రం కోసం రూ.కోటి డిమాండ్ చేస్తోందట.

వెండితెరపై అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గనని, అందువల్ల పారితోషికం విషయంలోనూ తాను రాజీపడబోనని తేల్చి చెప్పింది. సో.. బడా నిర్మాతలు ఆమెను బుక్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నప్పటికీ చిన్న నిర్మాతలు మాత్రం సై అంటున్నారు.