పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. సరైన జోడి కోసం నేటి యువత పరితపిస్తునారు. కానీ వివాహఅన్యున్నతకు ఆదర్శంగా నిలిచింది ఈ కొత్త జంట. సిద్దిపేట్ కు చెందిన విద్య సాగర్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్నతనం నుండే అనాధగా పెరిగిన విద్య సాగర్ వివాహ సంబందంతో కుటుంబాన్ని పొందలనుకున్నాడు. అందులో భాగంగా సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతి కుటుంబం నుండి వివాహ సంబంధం వచ్చింది . అయితే ఆ యువతి అంగవైకురాలు (మరగుజ్జు) అయినప్పటికీ విద్య సాగర్ వివాహానికి ఒప్పుకున్నాడు. ఆమెకు జీవితాన్ని ఇవ్వడంతో పాటు తనకు ఓ కుటుంబం అండగా ఉంటుందని ఆలోచించాడు. సికింద్రాబాద్ కు చెందిన రవళి (మరగుజ్జు) ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది . అంగవైకల్యం ఉన్నప్పటికీ వివాహానికి ఒప్పుకోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వారికి వివాహం జరిపించారు . ఈ వివాహ వేడుకకు ముషీరాబాద్ వేదిక అయ్యింది. గొప్ప మనస్సుతో ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులను.. వివాహానికి హాజరైన వాళ్ళు అభినందించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -