‘ఆర్‌ఎక్స్100’ పాప సాహసం.. ముదురు హీరోలతో సై…

0
82

‘ఆర్ఎక్స్100’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈమె నటించిన తొలి చిత్రంతోనే పేరుకే హీరోయిన్. కానీ, ఆమె ఈ చిత్రంలో విలన్. పైగా, ఆమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం ఆమె నటన వల్లే ఆడిందనే ప్రశంసలు కూడా వచ్చాయి.

అలా కుర్రకారు మదిని దోచుకున్న పాయల్.. మరో చిత్రంలో అచ్చం ప్రతినాయక ఛాయలున్న పాత్రలోనే కనిపించనుంది. నిజానికి ‘ఆర్ఎక్స్100’ చిత్రం తర్వాత ఆమెకు వరుసబెట్టి ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆమె మాత్రం ఆఫర్ల కోసం ఆరాటపడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

కేవలం కథాపరంగా వెరైటీగానూ, ఆసక్తిని కలిగించేలా ఉండే పాత్రలకు మాత్రమే పచ్చజెండా ఊపుతోంది. ఇపుడు ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. టాలీవుడ్‌లో ముదురు హీరోలైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రవితేజ వంటి హీరోల సరసన నటించేందుకు సై అంటోంది.

ఇప్పటికే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో బాలయ్య సరసన తళుక్కున మెరిసింది. రవితేజతో డిస్కోరాజాలో కాలు కదపనుంది. నాగార్జున ‘మన్మథుడు-2’ ప్రాజెక్టుకు సమ్మతించింది. విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న వెంకీ మామ చిత్రానికి కూడా ఈమె పేరే వినిపిస్తోంది. మొత్తానికి సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వడమే కాదు.. సెన్సేషనల్ డెసిషన్స్ తోనూ పాయల్ ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా మారిపోయింది.