విమాన ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు, దుర్ఘటనలు జరుగుతున్న తరుణంలో.. ఓ పైలట్ కాక్పిట్లో కునుకు తీశాడు. చైనాకు చెందిన ఆ పైలెట్ అదేమీ పట్టించుకోకుండా విమానం గాల్లోకి లేవగానే హాయిగా తన సీట్లోనే నిద్రపోయాడు. ఆ పక్కనే ఉన్న కో-పైలెట్ ఓ పక్క కంట్రోల్స్ ఆపరేట్ చేస్తూనే మరోవైపు పైలెట్ నిద్రపోవడాన్ని ఎంచక్కా వీడియోలో బంధించాడు.
చైనా ఎయిర్ లైన్స్కు చెందిన బోయింగ్-747 విమానంలో జరిగిందీ ఘటన. సదరు పైలట్కు 20 ఏళ్ల అనుభవం వున్నప్పటికీ.. కాక్పిట్లో కునుకు తీసిన వ్యవహారం నెట్టింట వైరల్ కావడంతో.. కునుకు తీసిన పైలట్తో పాటు చోద్యం చూసిన పైలెట్ను కూడా క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.