బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

0
43

బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్యం విషమించడం తో..గత కొంత కాలంగా బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఆయన పేగు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఐతే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం తో ఈరోజు ఆయన కన్నుమూశారు.

బీజేపీలో సాధారణ స్థాయి నుంచి రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగిన బద్దం బాల్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 వరకు కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు.