డ్రైవింగ్ రానివాడికి వాహనం అప్పగిస్తే జరిగేది యాక్సిడెంటే: చంద్రబాబు

0
55

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. జగన్ ఏనాడూ డ్రైవింగ్ స్కూల్ కు పోలేదు కాబట్టి ఆయనకు డ్రైవింగ్ రాదని అన్నారు. డ్రైవింగ్ రానివాడికి వాహనం అప్పగిస్తే జరిగేది యాక్సిడెంటేనని ఎద్దేవా చేశారు. చీరాల కార్యకర్తలతో సమావేశం అయిన సీఎం అక్కడి పరిస్థితులపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై వేసిన సెటైర్లు.. అందరిలో నవ్వులు పూయించాయి. జగన్‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే జరిగేవన్నీ ప్రమాదాలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను ఆటోవాలాలందరూ డ్రైవర్ నంబర్ వన్ అంటున్నారని, రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబేనంటున్నారని చెప్పారు. ఇక బాపట్ల కార్యకర్తలతో సమావేశం అయిన చంద్రబాబు ఎంపీ అభ్యర్థిగా మరోసారి మాల్యాద్రి పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.