జయరాం హత్య కేసులో 60మంది అనుమానితులను విచారించారట..

0
97

ప్రవాసాంధ్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మొత్తం 60 మంది అనుమానితులను విచారించిన పోలీసులు మరో ఐదారుగురిని విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల కస్టడీ శనివారంతో ముగిసింది. నటుడు సూర్యప్రసాద్, అతడి స్నేహితుడు కిశోర్, రౌడీషీటర్ నగేశ్, అతడి బంధువు విశాల్, శిఖా చౌదరి, ఆమె పనిమనుషులు, స్నేహితులను పోలీసులు ఇప్పటి వరకు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి సాయపడినట్టు గుర్తించిన పోలీసు అధికారుల పాత్రపై సాంకేతికపరమైన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. రాకేశ్‌కు వీరందరూ పరిచయం కావడం వెనక ఓ కార్మిక నాయకుడి పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయనను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.