కేటీఆర్-జగన్ కలిసి ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారు: అచ్చెన్నానయుడు

0
39

వైసీపీ అధినేత లండన్ వెళ్తూవెళ్తూ పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు ఇచ్చి వెళ్లినట్టు ఉన్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వంద శాతం పక్కా అని, జగన్ గెలుపు ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ-టీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రహస్య బంధం కేటీఆర్ వ్యాఖ్యలతో మరోమారు బయటపడిందని అచ్చెన్నాయుడు అన్నారు. కేటీఆర్-జగన్ కలిసి ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారని, వందమంది కేటీఆర్‌లు, జగన్‌లు వచ్చినా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే గత ఐదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.