బాబు గారూ…టీడీపీ కండువా కప్పుకుంటా..? అనకాపల్లి సీటు ఇస్తారా ?

0
49

2019 ఎన్నికల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వైకాపాకు.. వైకాపా నుంచి టీడీపీలోకి చేరే రాజకీయ నేతలు అధికమవుతున్నారు. ఇందులో భాగంగా పేరున్న… నేతలు సైతం రాజకీయ భవితవ్యం కోసం ఎన్నికల్లో క్రేజున్న పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఇంకా ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారని… ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీటును కోరుతున్నట్లు సమాచారం. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన రైల్వే జోన్ కోసం నిర్వహించిన ఆందోళనలోనూ పాల్గొన్నారు. కొణతాల త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్నాయి. వాటికి తెరదించుతూ ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.