ఐసిస్ మూకల పైశాచికం : పదేళ్ళ బాలికపై అత్యాచారం

0
243

ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ తీవ్రవాదుల అరాచకాలు ఇంకాసద్దుమణగలేదు. అనేక మంద్రి మహిళలను సెక్స్ బానిసలుగా చేశారు. తాజాగా పదేళ్ళ బాలికపై 100 ఐసిస్ ఉగ్రవాదులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇరాక్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు దాదాపుగా అంతమయ్యారు. కానీ, అనేక మంది మహిళలు సెక్స్ బానిసలుగా జీవితాన్ని అనుభవించారు. అలాంటి వారిలో ఓ పదేళ్ళ చిన్నారి కూడా ఒకరు. ఈ చిన్నారిని ఏకంగా వందమంది వరకు అనుభవించారు. గర్భం కూడా దాల్చింది. ఈ విషయం ఆ చిన్నారి మేనత్త (29) ఐఎస్‌ కబందహస్తాల నుంచి బయటపడి బయటి ప్రపంచానికి చెప్పేవరకూ ఆ పాప గురించి ఎవరికీ తెలియదు. ఆమె చెప్పిన ప్రకారం.. వారిది ఇరాక్‌లోని సింజార్‌ ప్రాంతం. ఓ రోజున ఐఎస్‌ ఉగ్రవాదులు ఆ ప్రాంతంపై దాడిచేసి.. కనిపించిన పురుషుడినల్లా కాల్చిచంపి, వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ ఎత్తుకెళ్లారు. తమ స్థావరాలకు చేరుకున్నాక.. అమ్మాయిలను వయసులవారీగా వారిని విభజించారు. పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల వరకూ వయసున్న అమ్మాయిలను పై స్థానాల్లో ఉన్న ఉగ్రవాదులు తీసేసుకున్నారు. వారిలో ఆ చిన్నారి కూడా ఒకరు. వారు తమకు తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని.. ఆకలిని తట్టుకోలేక జంతువుల పేడ వంటివి తిని ప్రాణాలు నిలుపుకొన్నామని బాలిక మేనత్త బోరున విలపిస్తూ చెప్పింది. అమ్మాయిలను వారు సెక్స్‌ బానిసల్లా చూసేవారని.. కోరిక తీరగానే జంతువులను అమ్మినట్టు వేరొకరికి అమ్మేసేవారని ఆవేదన వ్యక్తంచేసింది. చివరిసారిగా తన స్నేహితురాలు తన మేనకోడలిని చూసేటప్పటికి ఆమె గర్భం దాల్చిందని ఆమె తెలిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సహాయంతో తాను ఆ నరక కూపం నుంచి బయటపడ్డానని.. తన మేనకోడలు మాత్రం ఎక్కడుందో, ఎలా ఉందో తెలియదని కన్నీటిపర్యంతమైంది.