పుల్వామా దాడికి ప్రతీకారం.. మరో సర్జికల్ స్ట్రైక్.. శభాష్ అంటోన్న ప్రపంచ దేశాలు

0
49

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరో సర్జికల్ స్ట్రైక్‌తో దాడికి పాల్పడింది. దీంతో ప్రపంచ దేశాలు ఈ దాడి సరైందేనని.. పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించి సమూలంగా తుడిచిపెట్టేసింది. ఈ దాడిలో 350 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.

భారత్ దాడిపై పాక్ భిన్నవాదనలు వినిపిస్తోంది. భారత్ దాడిచేసిందని ఒకసారి, లేదని ఒకసారి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. భారత దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ స్పష్టం చేసింది. దాయాది ప్రకటనలు ఎలా ఉన్నా.. దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఉగ్రవాదులు కోలుకోకుండానే మరోదాడికి భారత్ వ్యూహరచన వేస్తున్నట్టు తెలుస్తోంది.