భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో మిల్కీ బ్యూటీ తమన్నా డేటింగ్లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ గుసగుసలపై అటు కోహ్లీగానీ, ఇటు తమ్మూగానీ నోరు విప్పలేదు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినట్టు మరో వార్త వైరల్ అయింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా ఫేమస్లీ ఫిలింఫేర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. తాను విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్లో నటిస్తున్నప్పుడు కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని తమన్నా చెప్పింది.
“2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. ఆ తర్వాత విరాట్ను నేను కలవలేదు. కనీసం మాట్లాడలేదు. కానీ నేను పనిచేసిన హీరోలతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎన్నో రెట్లు నయం” అని కితాబిచ్చింది. ఇక తాను అమెరికాకు చెందిన ఓ డాక్టర్ను పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలను సైతం మిల్కీబ్యూటీ ఖండించింది.