చిరంజీవి గురించి అలా రాస్తే నేను సహించను : జీవితా రాజశేఖర్

Naresh, Jeevitha, Rajasekhar to contest MAA elections

0
54
Jeevitha Rajasekhar
Jeevitha Rajasekhar

తెలుకు చిత్ర పరిశ్రమలో ఎన్నికల వేడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎం.ఏ.ఏ – సమా)కు ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్, మరోవైపు సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్‌లు పోటీ పడుతున్నాయి. విజయం కోసం ఈ ప్యానెల్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

అయితే, నరేష్ ప్యానెల్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నేపథ్యంలో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. నరేష్ ప్యానల్‌కు చిరంజీవి మద్దతు లేదని, చిరు మాటను లెక్కచేయకుండా నరేష్ ఎన్నికల్లో నిలబడ్డాడని కథనాలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలపై నటి జీవిత రాజశేఖర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నరేష్ ప్యానెల్‌లో జీవిత ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, ‘మా’ ఎలక్షన్స్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. తప్పుడు వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవిత, ఈ విషయంలో చిరంజీవి పేరు రావడం మరింత ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు.

నరేష్ ప్యానెల్ కు చిరంజీవి సపోర్ట్ లేదని, తన మాటను ధిక్కరించారన్న కారణంగా నరేష్ కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియాలో ఇష్టంవచ్చినట్టు రాస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చిరంజీవి ఎవరికీ సపోర్ట్ చేయడంలేదని, ఎవరు గెలిచినా అందరం కలిసి పనిచేద్దామని మాత్రమే ఆయన అన్నారని జీవిత స్పష్టం చేశారు. ‘మనమందరం ఒకే కుటుంబం, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడండి’ అని అందరికీ చెప్పారని ఆమె వివరించారు.