పుదుపేటకు సీక్వెల్.. ధనుష్ సరసన మళ్లీ స్నేహా?

0
42

కొలవెరి సాంగ్ మేకర్.. కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ ప్రస్తుతం మారి2లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ధనుష్ నటించిన మరో సినిమాకు సీక్వెల్ రానుంది. అవును ధనుష్ నటించిన పుదుపేటకు సీక్వెల్ రానుంది.

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేట’. స్నేహ, సోనియా అగర్వాల్‌ తదితరులు నటించారు. నటుడిగా ధనుష్‌కు మంచి గుర్తింపునిచ్చింది ఈ సినిమా. ఈ సినిమా రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోరికను నెరవేర్చేందుకు ధనుష్ సిద్ధమని ప్రకటించాడు.

పుదుపేట చిత్రానికి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. రెండో భాగం గురించి తాన ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు అడుగుతున్నారు. తొలి భాగం కన్నా ఏ మాత్రం తగ్గని స్థాయిలో సీక్వెల్‌ను రూపొందించాలని ఎదురు చూస్తున్నామని ధనుష్ ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో నటి స్నేహను హీరోయిన్‌గా మళ్లీ ఎంపిక చేసే అవకాశం వుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.