అంబానీ తనయుడి వివాహం భూలోక స్వర్గంలో జరిగిందా?

0
54

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహం అట్టహాసంగా జరిపించారు. దేశ వాణిజ్య నగరం ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్ ఆకాశ్-శ్లోకా మెహతాల వివాహ మహోత్సవానికి వేదికగా నిలిచింది. ఇక వధూవరులు ఆకాష్, శ్లోకా బాల్య స్నేహితులు. వీరి మధ్య సాన్నిహిత్యానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలపడంతో పెళ్లి వరకు వచ్చారు.

వీరి పెళ్లి స్వర్గంలో జరుగుతుందా.. అన్న చందంగా అతిథులకు అనిపించింది. వివాహ వేదిక మొదలుకుని ప్రతి అంశంలో సంపన్న కుటుంబం అని అంబానీ ఫ్యామిలీ నిరూపించారు.

ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా సెట్టింగ్‌లను తలదన్నే రీతిలో ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కృతం చేశారు ముఖేష్ అంబానీ. ఈ పెళ్లి ఏర్పాట్లు చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ సెలబ్రిటీ వివాహ మహోత్సవానికి బాలీవుడ్ తారలు, క్రీడాలోకం మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా విచ్చేశారు

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య చెరీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, తెలుగుతేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తదితరులు వివాహ వేడుకల్లో సందడి చేశారు.