కేజీఎఫ్ దర్శకుడితో మహేష్ బాబు సినిమా.. నమ్రతకు అది నచ్చిందట..

0
35

కేజీఎఫ్ సినిమా సైలెంట్‌గా విడుదలై భారీ కలెక్షన్లు కుమ్మరించింది. పీరియ‌డ్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు.

యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌.

ఇలా.. కేజీఎఫ్‌కు వచ్చిన క్రేజ్ ద్వారా యాష్‌తో పాటు ఆ చిత్ర దర్శకుడికి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం లభించనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే మహేష్ సతీమణి నమ్రతకు సినిమా స్క్రిప్ట్ జరిగిపోయాయట. ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నమ్రతకి నచ్చిందట. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని ఆమె చెప్పినట్టుగా సమాచారం. త్వరలోనే ఆయన పూర్తి కథను మహేశ్ బాబుకి వినిపించనున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అన్నీ పనులు సజావుగా సాగితే త్వరలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.