కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
అనంతరం ఆయన స్పందిస్తూ, తనకు వ్యక్తిగతంగా, ఓ నటుడిగా ఇది గొప్ప అచీవ్మెంట్ అని చెప్పారు. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41వ వసంతాలు పూర్తవుతున్నాయని తెలిపారు. తన సహ నటులు, కుటుంబసభ్యులు, తన అందమైన సినీ ప్రయాణంలో తన వెంట వుండి సహకారం అందించారని ఆయన వివహించారు.