మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తెరాస తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన కుమారుడు కార్తీక్కు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న సబితకు కాంగ్రెస్ నుంచి ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. అలాగే టీఆర్ఎస్ నుంచి సబితకు డబుల్ ధమాకా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
తెరాస పార్టీలోకి వస్తే సబితకు మంత్రి పదవి, తనయుడు కార్తీక్ రెడ్డికి మరో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకుముందు, అసంతృప్తితో ఉన్న సబితను బుజ్జగించే బాధ్యతను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.
అధిష్టానం అభిప్రాయాలను ఆమెకు వివరించినా ఫలితం కనిపించలేదు. అటు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా స్వయంగా ఫోన్ చేసి సబితతో మాట్లాడినట్టు వార్తలు వినిపించాయి. కానీ, ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా సబిత నిర్ణయాన్ని మార్చలేకపోయాయి.