పవన్ కల్యాణ్ నిజ స్వరూపం తెలిసే.. అలీ అలా చేశాడు.. శ్రీరెడ్డి

0
35

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా వైకాపాలో చేరిన కమెడియన్ అలీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిజ స్వ‌రూపం తెలిసిపోయింది కాబ‌ట్టే ఆయ‌న అక్క‌డ కాకుండా జ‌గ‌న్ వెంట వెళ్లాడ‌ని శ్రీరెడ్డి తెలిపింది.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీని కాద‌ని వైకాపాలో చేరడంపై అలీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. స్నేహం వేరు.. రాజ‌కీయం వేరంటూ అలీ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వార్తలపై శ్రీరెడ్డి మాత్రం పవన్ నిజ స్వరూపం తెలుసుకున్నాకే అలీ జనసేనలో చేరకుండా వైకాపా చేరిపోయాడని వ్యాఖ్యానించింది.

అంతేగాకుండా ముందు నుంచి కుటుంబాన్ని దూరం పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు అలీని కూడా ప‌క్క‌న‌బెట్టి స్నేహానికి కూడా తాను టికెట్స్ ఇవ్వ‌లేద‌ని గొప్ప‌లు చెప్పుకోడానికి అలీని ప‌క్క‌నబెట్టేసాడ‌ని ఆరోపించింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలపై పీకే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.