అనుమానంతో గొడ్డలితో భార్య రెండు కాళ్లు నరికిన భర్త

Husband attacks his wife with Axe at Krishna District

0
56
axe
axe

కృష్ణా జిల్లా నందిగామలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భరత్.. గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటన నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన పిచ్చయ్య తన భార్య రాజేశ్వరిపై అనుమానంతో మంగళవారం అర్థరాత్రి గొడ్డలితో రెండు కాళ్లు నరికాడు.

ఈ ఘటనలో రాజేశ్వరి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్లు రాజేశ్వరికి శస్త్ర చికిత్స చేసి ఒక కాలును తొలగించినట్లు వైద్యులు తెలిపారు. పిచ్చయ్య పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.