నా చివరి చిత్రం అదే కావొచ్చు : ఎస్.ఎస్.రాజమౌళి

SS Rajamouli comments on Mahabharatam project

0
55
SS Rajamouli
SS Rajamouli

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన మనసులోని మాటను వెల్లడించారు. తన చివరి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు కావొచ్చని చెప్పారు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే మహాభారతంను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తానని, అదే తన చివరి చిత్రం అవుతుందని తెలిపారు.

ప్రస్తుతం ఆయన టాలీవుడ్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాజమౌళి పై విధంగా సమాధానమిచ్చారు.

“మహాభారతం మొదలు పెడుతున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాను. కానీ నేను తీయబోయే తర్వాత సినిమా అదే అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు స్పష్టత ఇచ్చినా అదే ప్రశ్న మళ్లీ అడుగుతున్నారు. మహాభారతాన్ని సిరీస్ గా తీసే ఆలోచన ఉంది. బహుశా అదే తన చివరి సినిమా అవ్వొచ్చని” రాజమౌళి చెప్పారు.

కాగా, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, ఆయన మాత్రం కొంత విరామం తీసుకుని ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది జూన్ 30వ తేదీన థియేటర్లలోకి రానుంది.