తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ నక్షత్ర హోటల్లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డిని విశాల్ పెళ్లి చేసుకోనున్న విషయం తెల్సిందే. వీరిద్దరి నిశ్చితార్థం శనివారం జరిగింది. హైదరాబాద్లో ఓ హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్కు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇవాళ పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
ముఖ్యంగా, తమిళ నడిగర్ సంఘానికి పక్కా భవన నిర్మాణాన్ని విశాల్ ప్రారంభించారు. ఈ భవన నిర్మాణం పూర్తయితేనే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు. ఈ భవన నిర్మాణం వచ్చే యేడాది పూర్తికానుంది. ఈ భవన నిర్మాణం ముగిసిన వెంటనే విశాల్ పెళ్లి జరుగనుంది.