మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి, బీజేపీ నేతల సంతాపం

0
58

అనారోగ్య సమస్యలతో సుదీర్ఘంగా బాధపడుతూ వచ్చిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచారు. క్లోమగ్రంథి సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆదివారం రాత్రి కన్నుమూశారు. అమెరికాలో సెప్టెంబరులో తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు.

ఇటీవల ముక్కులో పైపుతోనే విధులకు హాజరై అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. గత సంవత్సరం మార్చిలో ఆయన క్లోమగ్రంథి సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పారికర్ గతంలో దేశ రక్షణ మంత్రిగానూ విశేష సేవలందించారు.

కాగా పారికర్ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పారికర్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.