రకుల్‌పై కన్నేసిన టాలీవుడ్ మన్మథుడు..

0
47
rakul preeth singh
rakul preeth singh

అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం మన్మథుడు-2. గతంలో వచ్చిన మన్మథుడుకు ఇది సీక్వెల్. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా ‘వెంకీమామ’ సినిమాలో చైతూ జోడీగా ఎంపికైన రకుల్, ‘మన్మథుడు 2’ కోసం ఆ సినిమాను వదిలేసుకుందనే టాక్ వచ్చింది.

ఆ తర్వాత ‘మన్మథుడు 2’ సినిమా కోసం ఆమెను తీసుకున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కథానాయికగా ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చలాకీగా .. బిందాస్‌గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో రకుల్ ఉందని అంటున్నారు.