మజా చేస్తున్న కొత్త జంట ఆర్య – సాయెషా

0
40

ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు ఆర్య – సాయెషా సైగల్. మార్చి 10వ తేదీన మాంగల్య బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ హ‌నీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. హ‌నీమూన్ కోసం విదేశాలకి వెళ్లిన వారు లైఫ్‌లో ఎప్ప‌టికి ఓ మెమోరీగా ఉండేలా ఫోటోలు దిగుతున్నారు.

సాయేషా భ‌ర్త ఆర్య త‌న కెమెరాలో సాయేషాని బంధించాడు. ఆ ఫోటోల‌ని సాయేషా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ సూర్య‌కాంతి స‌మ‌క్షంలో మా ప్రేమ‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. అంతేకాదు త‌న పోస్ట్ చేసిన ఫోటోల‌కి క్రెడిట్ త‌న భర్తకి ఇచ్చింది.

2018లో వ‌చ్చిన “గ‌జినీకాంత్” అనే చిత్రంలో తొలిసారి ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న “క‌ప్పం” చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే వివాహానంత‌రం ఆర్య‌, సాయేషా “టెడ్డీ” అనే సినిమాలో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు.