రెండు భాషల్లో రిలీజ్ కానున్న ‘ఫిదా’ భామ చిత్రం

0
47

ఫిదా భామ సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకి అన్ని భాష‌ల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ఇటీవ‌ల ‘ప‌డిప‌డి లేచే మ‌న‌సు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌ుక‌రించింది. ఈ చిత్రం పెద్ద‌గా అభిమానుల‌ని అల‌రించ‌క‌పోయిన‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత తమిళ హీరో ధనుష్ నటించిన “మారి” చిత్రంలో సాయి నటించింది. ఈ చిత్రంలో ఆమె అదరగొట్టింది. అయితే సాయి ప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిర‌న్‌’ని తెలుగులో, త‌మిళంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే చిత్రాన్ని వివేక్ తెర‌కెక్కించ‌గా ఫాహ‌ద్ ఫాజిల్‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. నిర్మాణ సంస్థ సెంచ‌రీ ఫిలిమ్స్ అతిర‌న్ చిత్రాన్ని మూడు భాష‌ల‌లో ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తుంద‌ట.