నా కోసం రాజశేఖర్ ఉన్నాడనిపించేది.. కోపం అలా తుస్సుమనేది..

0
46

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కోసం వైఎస్సార్ ఉన్నాడనిపించేలా ఆయన మాటలు, ప్రవర్తన ఉండేదని చెప్పారు.

”నేను కోపంగా వున్నా.. వాడు ఎట్టా ఉన్నాడు.. వీడు ఎట్టా వున్నాడు.. అనేవారు. అయిపోయే కోపం తుస్సుమంటుంటుందని..”’ అతనికి (రాజశేఖరరెడ్డి) సైకాలజీ బాగా తెలుసు. వెరీ ఫ్రెండ్లీ. ‘తన’ అనుకున్న వాళ్లకు సాయం చేసే గుణం అతనిలో ఉండేది’ అని జేసీ చెప్పుకొచ్చారు.

తన ‘ఆత్మకథ’ రాయాల్సి వస్తే అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల ప్రస్తావన తప్పకుండా ఉంటుందని జేసీ వ్యాఖ్యానించారు. తనకు తెలిసిన కఠిన సత్యాలు కూడా ఈ ఆత్మకథలో ఉంటాయని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని, వైఎస్, చంద్రబాబు గురించి అన్నీ నిజాలే చెబుతాను తప్ప, అబద్ధాలు చెప్పనని తెలిపారు.