రైనా అదరగొట్టాడు.. ఐపీఎల్‌లో కొత్త రికార్డు.. 5వేల పరుగులు

0
55
Suresh Raina
Suresh Raina

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై 12వ సీజన్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. లాస్ట్ సీజన్‌లో చెత్త ప్రదర్శన ఇచ్చిన బెంగళూరు జట్టు, కొత్త సీజన్‌ను కూడా అలాంటి ప్రదర్శనతోనే ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఐపీఎల్ కొత్త చరిత్ర సృష్టించాడు.

ఐదు వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన రైనా.. 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో 5004 పరుగులతో రైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 4954 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4493), గౌతం గంభీర్ (4217) పరుగులో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.