యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకొనే

0
49

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఈమె వెండితెరపై కనిపించి ఒక యేడాది కాలం అయింది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకుని ఒక యేడాది అయింది. అప్పటి నుంచి ఆమె కెమెరాకు దూరంగా ఉంది. ఆమె నటించిన ఆఖరి చిత్రం పద్మావత్.

పైగా, బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో దీపిక ఒకరు. ఆమె క్రేజ్ అలాంటిది. అలాంటి దీపిక తాజాగా ఒక బయోపిక్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ‘ఛపాక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె ఫస్టులుక్‌ను రిలీజ్ చేశారు. యాసిడ్ దాడి జరిగిన అనంతరం స్టిల్2ను ఫస్టులుక్‌గా వదిలారు. గ్లామర్ క్వీన్‌గా మార్కులు కొట్టేసిన దీపిక, ‘ఛపాక్’లో ఈ తరహా లుక్‌తో కనిపించడానికి సిద్ధపడటం సాహసమేనని చెప్పాలి. 2020 జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఈ ఫస్టు పోస్టర్ ద్వారానే ప్రకటించారు.