ఎన్నికల పోటీపై మాధురీ దీక్షిత్ క్లారిటీ

0
38

17వ సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీలో లేనని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాననే వార్తలు పుకార్లు మాత్రమేనని కొట్టిపడేశారు.

తాను ఏ పార్టీ తరపున పోటీ చేయబోనని… ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీని కూడా ఇచ్చానని చెప్పారు. తనతో పాటు మరో ఇద్దరు యాక్టర్లపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. 1984లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన మాధురీ… స్వల్ప కాలంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈమె బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నారనే ప్రచారం సాగుతోంది. దీన్ని ఆమె ఖండించారు.