సాయిపల్లవిని ఇంకా లైన్లో పెట్టలేదు : ఏఎల్ విజయ్

0
33

మలయాళ బ్యూటీ అమలా పాల్ మాజీ భర్త, యువ దర్శకుడు ఏఎల్. విజయ్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే విడిపోయారు. ఈ క్రమంలో విజయ్ హీరోయిన్ సాయి పల్లవిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి.

వీటిపై ఏఎల్ విజయ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను జయలలిత బయోపిక్ ‘తలైవి’ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. విజయ్ గతంలో హీరోయిన్ అమలాపాల్‌ను వివాహమాడి కొన్నాళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు.

కాగా, కణం చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కీలకమైన పాత్రను పోషించింది. అపుడు వీరిద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు రావడంతో విజయ్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.