పవన్ ప్రచార సభలో తొక్కిసలాట.. ఆటోడ్రైవర్ మృతి.. ఇనుప రాడ్లు జారిపోవడంతో?

0
31

ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో జనసేన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం పవన్ పాల్గొన్న సభలో ఉన్నట్టుండి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.

పవన్ కల్యాణ్ హాజరైన ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభకోసం ఏర్పాటు చేసిన స్పీకర్లకు ఉన్న ఇనుప రాడ్లు జారిపోవడంతో జనాల్లో తొక్కిసలాట ఏర్పడింది.

ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకరినొకరు తొక్కుకోవడంతో సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నంద్యాల ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. మరణించిన వ్యక్తిని సిరాజ్‌గా గుర్తించారు. అతడి వయసు 30 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు.